భీమ సదుపాయం లో టిడిపి పార్టీ శ్రేణులు - TDP Party News
టిడిపి పార్టీ తమ కార్యకర్తలకు బీమా సదుపాయం అన్నది దేశంలో మరే రాజకీయ పార్టీ చేయని వినూత్న కార్యక్రమం చేపటింది. అలాంటిది... పార్టీలోతాను చేపట్టిన తొలి పదవీ నిర్వహణలో భాగంగా కార్యకర్తల సంక్షేమ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. 2015 జనవరి నుంచి ఈ బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో తెలుగుదేశం పార్టీకి సుమారు 70 లక్షల మంది సభ్యులున్నారు. వారందరినీ బీమా పరిధిలోకి తీసుకురావడం విశేషం. పార్టీలో ఇది వరకు సాధారణ, క్రియాశీల సభ్యత్వాలు ఉండేవి. ఇటీవల ఒకే సభ్యత్వ విధానం ప్రవేశపెట్టారు. రెండేళ్లకొకసారి సభ్యత్వాల పునరుద్ధరణ, కొత్త సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఉంటుంది. రూ.100 సభ్యత్వ రుసుం చెల్లించి సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికీ పార్టీ ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తోంది. వారి తరఫున పార్టీనే ప్రీమియం చెల్లిస్తోంది.
ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఇంతవరకు ప్రమాదాల్లో మరణించిన 1971 కార్యకర్తల కుటుంబాలకు రూ.39.42 కోట్ల పరిహారం అందింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ లో 1673, తెలంగాణలో 298 కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రెండేసి లక్షల రూపాయల చొప్పున బీమా చేయూత లభించింది.
0 comments:
Post a Comment